Thursday, 3 November 2011

గుజరాతీ రక్తము







ఒక అరబ్బు షేకుకు ముంబై లో ఆపరేషన్ జరిగింది . ఆయనది చాలా చాలా అరుదైన రక్తము . ఆ రక్తము గురించి చాలా ప్రయత్నాలు చేసారు . చివరకు ఒక గుజరాతీ రక్తము సరిపోయింది.
ఆ గుజరాతీ రక్తము ఇచ్చినందుకు ఆ షేకు అతనికి పది లక్షలు డబ్బు , ఒక వజ్రాల ఉంగరము , ఒక బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు . గుజరాతీ ఎంతో సంతోషించాడు .
సరిగ్గా ఒక  సంవత్సరము తర్వాత మళ్లీ ఆ షేకుకు  ముంబై లోనే  ఆపరేషన్ జరిగింది. మళ్లీ రక్తము అవసరము అయితే ఆ గుజరాతీ వచ్చి రక్తము ఇచ్చాడు ,  ఈ సారి ఇంకా ఎన్ని బహుమతులు ఇస్తాడో అని అతను మనసులో అనుకున్నాడు.
ఆపరేషన్ అయిన తర్వాత షేకు ఒక కిలో మిఠాయి ఇచ్చాడు .
గుజరాతీకి కోపం వచ్చి , " పోయిన సారి అంత డబ్బు , విలువైన నగలు ఇచ్చావు , ఈ సారి ఏంటి కేవలం స్వీట్స్ తో సరిపెట్టావు " అని అన్నాడు .
అందుకు షేకు "అప్పుడంటే నాది అరబ్బు రక్తము కాబట్టి అలా ఇచ్చాను , కాని ఇప్పుడు గుజరాతీ రక్తము గదా " అన్నాడు .

No comments:

Post a Comment