ఆ మధ్య చిరంజీవి నాయకుడుగా వచ్చిన సినిమాలో శవానికి వైద్యం
చేస్తూ డాక్టర్ లు చేసే హడావిడి చూశాము, ఆ తరువాత కరీం నగర్ లో
ఒక హాస్పిటల్ లో శవానికి వైద్యం చేసినట్లు విన్నాము. కానీ ఇప్పుడు
శవానికి వైద్యం చేస్తూ అది తప్పకుండా బ్రదుకుతుంది అని టీవీ లలో
చెపుతుంటే నవ రసాల్లో ఏ హావభావాలు చూపాలో తెలియడం లేదు.
విభజన జరిగిపోంది, అయినా కొంపలు ఏమీ మునిగి పోలేదు మా
తడాకా చూపిస్తాము అంటే, మరి తెలంగాణా ప్రజల సంగతి ఏమిటి?