నిజానికి నా మొదటి కచేరి ఇచ్చే వరకు నాకు తెలియదు.
నా అభిమానుల హడావిడి ,వారు నాకు చేసిన సన్మానము చూసి ప్రఖ్యాత గాయకులు శ్రీ బాల మురళి కృష్ణ గారు, శ్రీ జేసుదాస్ గారు మరియు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యపొయ్యారు.
అసలు జరిగిన సంగతి ఏమిటంటే ఒక కచేరిలో వారు ముగ్గురు రెండు రెండు పాటల చొప్పున పాడారు,
తర్వాత నేను ఒక పాట పాడి రెండవ పాట పాడబోతుంటే, నా అభిమానులు స్టేజి మీదకు దూసుకొచ్చారు.
నాకు దండలు వేసి , శాలువా కప్పారు.
ఒక అభిమాని మైక్ లాక్కొని మాట్లాడడము మొదలు పెట్టాడు, " మా మట్టుకు మాకు మీరే గొప్ప గాయకులు , మీ లాంటి గాయకులే ఇప్పుడు ఎంతో అవసరము . ఇంత అద్భుతమైన గాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు. నిజానికి మేమందరమూ ఇక్కడ బజ్జీలు, పల్లీలు, టీలు . సోడాలు అమ్ముకునే వాళ్లము. ఇంతకూ ముందు వాళ్ళు పాడినప్పుడు మేము ఒక్కటి కూడా అమ్మలేక పోయ్యాము, కాని మీరు పాడటము మొదలు పెట్టగానే ఒక్కటి గూడా మిగలకుండా అన్ని అమ్మేసుకున్నాము ........
కల చెదిరింది కథ మారింది
కన్నీరే ఇక మిగిలింది ... కన్నీరే ఇక మిగిలింది




No comments:
Post a Comment