Wednesday, 23 May 2012

పినాకి లారా ఆలోచించండి


తెలిసినట్లుగానే మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగాయి.

 పెట్రోల్ బంకుల ముందు క్యూలు పెరిగాయి.




 పనిలో పనిగా ట్రాఫిక్ జాములు గూడా పెరిగాయి. 

ఇది ఈ సాయంత్రం వీధులలో పరిస్థితి. ఇది అంతా మనకు అవసరమా? 

ఒక్క సారి ఆలోచించండి. మనము వృధాగా ఎంత పెట్రోల్ వేస్టు చేస్తున్నాము, ఇలా పెరిగినప్పుడు ఆ క్యూలలో గంటలకొద్దీ పోరాడి నాలుగు లీటర్ల పెట్రోల్ పోయించుకుని ఏమి సాధిస్తున్నాము. నిజంగా అత్యవసరము ఉండి తొందరగా వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది ఎంత ఇబ్బంది. 


1) ఒక మోటారు సైకిలు యజమాని ఎంత పెట్రోల్ కొట్టించు కుంటాడు, మహా అయితే ఐదు లీటర్లు 5 X 7 = 35 రూపాయలు. ఆ తర్వాత కొత్త రేటుకే కొనాలిగదా. 


2) ఒక కారు యజమాని ఎంత కొంటాడు , ఇరవై లీటర్లు , అంటే 140 రూపాయలు.




ఇది ఒక ప్రాణం కంటే విలువైనదా? ఒక కుటుంబ సమస్య కంటే గొప్పదా? ఒక ఉద్యోగి కష్టము  కంటే పెద్దదా? ఎవరికీ ఏ సమస్య ఉండి ఈ క్యూల వలన వేదన పడుతున్నారో ఆలోచించండి. మనం వ్యక్తిగతముగా ఎంత సమయాన్ని కోల్పోతున్నాము, ఆ రద్దీలో వాహనాలకు నష్టము కలగడము లేదా?

అసలే మనకున్న నెత్తినొప్పులు మనకున్నాయి, తరచుగా వచ్చే ఈ తల నొప్పి కూడా ఎందుకు?


 రోట్లో తల పెట్టి రోకలి పోట్లకు వెరుస్తామా?

 అలాగే వాహనము కొని పెరిగే పెట్రోల్ రేట్లకు భయపడతామా? బాధే సౌక్యమనే భావన రానీవోయి ఆ ఎరుకే నిత్యానందము బ్రహ్మ్హనందము  


No comments:

Post a Comment