Friday, 27 January 2012

మహాత్ముడికి కోపం వస్తే...


మహాత్ముడికి కోపం వస్తే...




ఒక ఇల్లు లేని వ్యక్తీ రోజు ఫుట్ పాత్  మీద పడుకుంటున్నాడు. ఒక రోజు   ఫుట్ పాత్  మీద  స్థలం లేక అక్కడ గాంధీ విగ్రహము ఉంటే దాని దగ్గర పడుకున్నాడు. అర్ధరాత్రి అయిన తర్వాత ఎవరో నిద్ర లేపుతుంటే మెలకువ వచ్చింది. లేచి చూస్తే గాంధీ మహాత్ముడు నుంచుని చేతి కర్రతో తడుతున్నాడు. ఆ   వ్యక్తి   వెంటనే మహాత్ముని ముందు మోకరిల్లి నమస్కరించాడు.


 అప్పుడు గాంధీ మహాత్ముడు అతనితో " మీకు అసలు విశ్వాసము లేదు. నేను స్వతంత్రం కొరకు ఎంత చేసాను. మీరు నాకు ఏమిచ్చారు? అన్ని చోట్ల నా విగ్రహాలు పెట్టారు, మంచిదే కాని ప్రతీ విగ్రహం కూడా నుంచునో లేక నడుస్తునట్లో పెట్టారు. ఏ ఆ శివాజీ లాగా నాకు కూడా గుఱ్ఱము ఇస్తే ఎంచక్కగా కూర్చునే వాడినిగా, నా కాళ్ళు ఎంత నెప్పి పెడుతున్నాయో తెలుసా? " అన్నాడు .






మరునాడు అతను చాలా మంది ఎం.ఎల్ .ఏ లను మంత్రులను కలిసాడు , కాని ఒక్కరు కూడా అతని మాట పట్టించుకోలేదు. చివరకు ఒక మంత్రి ఆ రాత్రి బాపుజీని కలవడానికి ఒప్పుకున్నాడు. 
ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆ విగ్రహము దగ్గరకు వచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి అయిన తర్వాత బాపూజీ మళ్లీ వచ్చాడు. 
ఆ వ్యక్తితోటి గుర్రం గురించి అడిగాడు.

దానికి అతడు బాపూ నేను చాలా పేదవాడిని నీకు గుర్రం కొనే శక్తి నాకు లేదు , అందుకనే ఈయనను తీసుకొచ్చాను అని మంత్రిని చూపించాడు. 
దానికి గాంధీ మహాత్ముడు " నిన్ను గుర్రం తెమ్మంటే గాడిదను  తెచ్చావా ?  అన్నాడు కోపంగా.


2 comments: